లక్షలకు లక్షలు టాయిలెట్ల పాలు

by  |
public-toiletn
X

దిశ, అల్వాల్​: స్వచ్ఛసర్వేక్షణ్‌లో భాగంగా జీహెచ్‌ఎంసీ అనేక పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా గ్రేటర్​ హైదరాబాద్​ ప్రజలు బహిరంగా ప్రదేశాలలో మలమూత్రాలు విసర్జించకుండా పబ్లిక్​ ప్రదేశాలలో ఎక్కడికక్కడ​ టాయిలేట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందుకు అనుగుణంగా అల్వాల్ సర్కిల్ పరిధిలోని వెంకటాపురం డివిజన్​ఇందిరానగర్​నుండి మచ్చబొల్లారం డివిజన్​ కౌకూర్​ వరకు వంద వరకు పబ్లిక్​ టాయిలేట్లు నిర్మించారు.

జీహెచ్ఎంసీ అధికారులు హడావుడిగా నిర్మించి నీటి కనెక్షన్ ఇవ్వలేదని, వాటి నిర్వహణ పట్టించుకోకపోవటంతో లక్షలాది రూపాయలు వృథా అయ్యాయని విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో వాటర్​ ట్యాంకులు ఏర్పాటు చేసినప్పటికి, నీటివసతి కల్పించలేదని స్థానికులంటున్నారు . ప్రణాళికలు లేకుండా ఇలాంటివి నిర్మించి కాంట్రాక్టర్లు, నేతలు, అధికారుల జేబులు నింపటం తప్పితే ఎలాంటి ఉపయోగం ఉండదని మేధావులు విమర్శలు చేస్తు్న్నారు. ఇప్పటికైన జీహెచ్‌ఎంసీ అధికారులు కళ్లు తెరచి పబ్లిక్ టాయిలెంట్ల నిర్వహణను చేపట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Next Story