8న ఫలక్ నుమా ప్యాలెస్‌లో రానా లగ్గం

by  |
8న ఫలక్ నుమా ప్యాలెస్‌లో రానా లగ్గం
X

దిశ, వెబ్ డెస్క్: ఇన్నాళ్లు తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఖాతాలో ఒకరిగా ఉన్నా రాగా దగ్గుబాటి ఇటీవలే అందులోంచి బయటపడ్డాడు. ఇటీవలే సోషల్ మీడియా వేదికగా తన ప్రియురాలిని అందరికీ పరిచం చేశారు. కాగా ప్రియురాలు మిహికా బజాజ్‌తో రానా ఎంజెగ్ మెంట్‌ కూడా అయిపోయింది. అంతేగాకుండా పెళ్లి తేదీ కూడా ఖరారైంది. ఆగస్టు 8వ తేదీన హైదరాబాద్‌లోని ఫలక్ నుమా ప్యాలెస్‌లో జరుగనుంది. ప్రస్తుతం రెండు కుటుంబాలు పెళ్లి పనుల్లో నిమగ్నం అయ్యాయి. రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. దీని మూలంగా ప్రభుత్వ నిబంధనలకు లోబడి పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించాలని రానా తండ్రి దగ్గుబాటి సురేశ్ బాబు భావిస్తున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఈ వివాహానికి ఆహ్వానించనున్నారు. త్వరలోనే కేసీఆర్, జగన్‌లను రానా స్వయంగా కలిసి తన పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానించనున్నాడు.

Next Story