వలస కార్మికులకు రాజస్థాన్ ప్రభుత్వ సాయం

by Shamantha N |

<p>జైపూర్: సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి వలస కూలీలకు కేంద్రం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కూలీలను స్వరాష్ట్రాలకు తరలించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. రాజస్థాన్ ప్రభుత్వం ఇప్పటికే 40,000 మంది వలస కూలీలను గురువారం పంపించింది. ఇందులో మెజార్టీ కార్మికులు మధ్యప్రదేశ్‌కు, కొందరు హర్యానాకు వెళ్లిన్నట్టు అధికారులు చెబుతున్నారు. మొత్తం 6లక్షల మంది కార్మికులు తమను స్వగ్రామాలకు చేర్చాలని రాజస్థాన్ ప్రభుత్వాన్ని కోరారని అధికారులు తెలుపుతున్నారు. అయితే, వారిని చేర్చేందుకు రోడ్ వే బస్సులు ఉపయోగించనున్నారు. [&hellip;]</p>

వలస కార్మికులకు రాజస్థాన్ ప్రభుత్వ సాయం
X

జైపూర్: సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి వలస కూలీలకు కేంద్రం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కూలీలను స్వరాష్ట్రాలకు తరలించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. రాజస్థాన్ ప్రభుత్వం ఇప్పటికే 40,000 మంది వలస కూలీలను గురువారం పంపించింది. ఇందులో మెజార్టీ కార్మికులు మధ్యప్రదేశ్‌కు, కొందరు హర్యానాకు వెళ్లిన్నట్టు అధికారులు చెబుతున్నారు. మొత్తం 6లక్షల మంది కార్మికులు తమను స్వగ్రామాలకు చేర్చాలని రాజస్థాన్ ప్రభుత్వాన్ని కోరారని అధికారులు తెలుపుతున్నారు. అయితే, వారిని చేర్చేందుకు రోడ్ వే బస్సులు ఉపయోగించనున్నారు. ఇందులో కూడా సోషల్ డిస్టెన్స్ (సామాజిక దూరం) పాటించేలా తగు చర్యలు తీసుకుంటున్నారు.

Tags: migrant workers, home, centre, permission, govt, action

Next Story