వలస కూలీల తరలింపు ప్రారంభం

by  |
వలస కూలీల తరలింపు ప్రారంభం
X

హైదరాబాద్: లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న వలస కూలీలను మంగళవారం నుంచి వారంపాటు వారి స్వరాష్ట్రాలకు తరలించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా 1,200 మంది వలస కూలీలతో కూడిన ప్రత్యేక రైలు ఘట్‌కేసర్ నుంచి బీహార్‌కు బయల్దేరింది. వీరందరికీ స్కీనింగ్ పరీక్షలు నిర్వహించిన అనంతరం ప్రయాణానికి అనుమతినిచ్చామని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పరిశీలించారు.

Tags : Migrant laborers, moving, special train, home state, govt, bihaar



Next Story