పోలీసులకు 750 పీపీఈ కిట్లు అందజేత

by  |
పోలీసులకు 750 పీపీఈ కిట్లు అందజేత
X

దిశ, హైదరాబాద్: హైదరాబాద్ నగర పోలీసులకు మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ మంగళవారం పీపీఈ కిట్లు, ఫేస్ మాస్కులను అందజేసింది. బషీర్ బాగ్‌లోని సీపీ కార్యాలయంలో నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌కు మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ ఎండీ రాజీవ్ కుమార్ 750 పీపీఈ కిట్లతో పాటు 2,500 వీనస్ మాస్క్‌లు, 750 ఫేస్ షీల్డ్స్ అందించారు. విపత్కర పరిస్థితుల్లో నిరంతరం శ్రమిస్తున్నపోలీసుల రక్షణకు సీఫ్టీ సామగ్రిని అందజేయడం అభినందనీయం సీపీ తెలిపారు.


Next Story

Most Viewed