‘దిశ’ కథనానికి ఎంఈవో స్పందన.. ఇద్దరు టీచర్లకు షోకాజ్ నోటీసులు

by  |
‘దిశ’ కథనానికి ఎంఈవో స్పందన.. ఇద్దరు టీచర్లకు షోకాజ్ నోటీసులు
X

దిశ, బయ్యారం : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కాచనపల్లి పంచాయతీ పరిధిలో ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు తమ విధుల పట్ల అలసత్వం వహించడమే కాకుండా, సమయ పాలన పాటించడం లేదు. దీంతో ‘మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి.. సమయ పాలన పాటించని టీచర్లు మాకొద్దు’ అనే శీర్షికతో మంగళవారం ‘దిశ’ వెబ్‌సైట్‌‌లో ప్రచురించిన కథనానికి అధికారుల నుంచి స్పందన లభించింది.

బుధవారం మండల ఎంఈఓ పూల్‌చంద్, కొత్తపేట కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు దేవేంద్ర చారి కాచనపల్లి ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. అనంతరం పాఠశాలలో ఉపాధ్యాయుల గైర్హాజరుపై చుట్టుపక్కల వారిని, విద్యార్దులను అడిగి సమాచారం సేకరించారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు బాలాజీ, సమ్మయ్య, దుర్గయ్యలతో మాట్లాడారు. పాఠశాల విధుల పట్ల ఎవరైనా అలసత్వం వహిస్తే మాకు సమాచారం అందించాలన్నారు. మంగళవారం పాఠశాలకు హజరు కానీ ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్ ఇచ్చినట్లు తెలిపారు.

Next Story

Most Viewed