నాతో పెట్టుకోకు..నీ జాబ్ తీసేయిస్తా

by  |
నాతో పెట్టుకోకు..నీ జాబ్ తీసేయిస్తా
X

దిశ నిజామాబాద్: మద్యం మత్తులో ఓ యువకుడు ఏం చేస్తున్నాడో మర్చిపోయాడు. తాను ఎక్కడ ఉన్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను అనే కనీస ఇంగితం లేకుండా ప్రవర్తించాడు. నన్ను ఎవరనుకుంటున్నావు..నేను గానీ తలుచుకుంటే నీ జాబ్ తీసెయిస్తానంటూ పోలీసు అధికారినే బెదిరించాడు. అంతటితో ఆగకుండా పోలీస్ ‌స్టేషన్‌లో గందరగోళం సృష్టించాడు.ఈ ఘటన నిజామాబాదు జిల్లా ఎడపల్లి పీఎస్‌లో మంగళవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం..మండల కేంద్రానికి చెందిన కటకం శంకర్ పై దాడి చేసిన ఘటనలో రాజీవ్ నాయుడు అనే యువకుడిని ఎస్సై ఎల్లాగౌడ్ పిలిపించాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతడు స్టేషన్లో వీరంగం సృష్టించాడు. ఫర్నిచర్ ధ్వంసం చేసేందుకు యత్నించగా, సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఆ యువకుడు తన నోటికి పనిచెప్పాడు. నేను తలుచుకుంటే మీ ఎస్సైని సస్పెండ్ చేయిస్తానని బెదిరింపులకు దిగాడు. అతని చర్యలతో విసుగు చెందిన ఎస్సై రాజీవ్ నాయుడిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.


Next Story

Most Viewed