శిల్పారామంలో మొక్కలు నాటిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు

by  |
శిల్పారామంలో మొక్కలు నాటిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు
X

దిశ, శేరిలింగంపల్లి : గ్లోబల్ వార్మింగ్‌ని అరికట్టాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని అన్నారు ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శశిథరూర్. హైదరాబాద్ పర్యటనలో భాగంగా కమిటీ సభ్యులతో కలిసి శిల్పారామంలోని రాక్ హైట్స్ లో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ ను శశిథరూర్ ప్రత్యేకంగా అభినందించారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా పర్యావరణానికి మేలు కలిగించేందుకు మొక్కలు నాటే అవకాశం లభించిదని సంతోషం వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్ హరితహారం స్పూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముందుకు వెళుతుందని, ఇప్పటివరకు 16 కోట్లకు పైగా మొక్కలు నాటడం జరిగిందని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీల బృందం మహువా మొయిత్ర, సయ్యద్ జాఫర్ ఇస్లాం, నరేంద్ర జాదవ్, సుమతి తమిజిచ్చీ తంగపాండియన్‌, ధైర్యశీల్ సంభాజిరావు మానే, శక్తిసింహ్ గోహిల్, నదిముల్ హాక్, పీఆర్.నటరాజన్, సంతోష్ పాండే పాల్గొన్నారు. అనంతరం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఎంపీ రంజిత్ రెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని అందజేశారు.


Next Story

Most Viewed