కేసీఆర్ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను.. ఎమ్మెల్సీ యాదవ రెడ్డి

by  |
mlc
X

దిశ, మర్కుక్‌: సీఎం కేసీఆర్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాల అమలులో తన వంతు కృషి చేస్తానన్నారు. గురువారం మర్కుక్ మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మేకల కనకయ్య ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవ రెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్‌ సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. సన్మానించిన వారిలో మల్లేశ్, మురళి తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed