- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: అల్లు ఫ్యామిలీ ఓటీటీ ప్లాట్ఫామ్ చాలా పెద్ద మిస్టేక్ చేసింది. ‘ఆహా’లో ప్రసారమవుతున్న ‘సామ్ జామ్’ షోలో జనవరి 1న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్గా వస్తుండగా.. ఈ ప్రోమోకు సంబంధించి ట్విట్టర్లో వివాదాస్పద పోస్ట్ పెట్టారు. ‘మెగాస్టార్ అల్లు అర్జున్.. మెగా ఎపిసోడ్’ అంటూ ట్వీట్ చేశారు. దీనిపై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవడంతో చేసిన తప్పును సరిదిద్దుకుంటూ మరో పోస్ట్ పెట్టారు. ఇది 2020 క్రేజీ ఇయర్ లాస్ట్ డే అని, తమను క్షమించి.. ప్రేమ, చిరునవ్వుతో 2021లోకి అడుగుపెట్టాలని కోరారు. ‘మా నుంచి టెక్నికల్గా వచ్చిన మిస్టేక్ మిమ్మల్ని చాలా హర్ట్ చేసి ఉంటుందని తెలుసు.. కానీ అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక్కరే మెగాస్టార్.. అది ఎవరో మనందరికీ తెలుసు’ అని ట్వీట్ చేశారు.
కానీ మెగాఫ్యాన్స్ ఆల్రెడీ హర్ట్ అయిపోయి ఫైర్ మీద ఉన్నారు. కామెంట్లలో అదే ఫైర్ను చూపిస్తున్నారు కూడా. ఈ మిస్టేక్ వెనుక అల్లు అరవింద్, అల్లు అర్జున్ కన్నింగ్ ఇంటెన్షన్ ఉందని మండిపడుతున్నారు. టూ స్మార్ట్గా యాక్ట్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించు అల్లు అరవింద్.. అసలు నీ కొడుకు ఎవరి పేరుతో యాక్టర్గా మారాడో రియలైజ్ అవ్వు అంటున్నారు. మెగాస్టార్ బిరుదు దక్కాలంటే ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ కూడా అలాంటి సర్వీస్ చేయాలని.. మీలాంటి వాళ్లకు అంత సీన్ లేదంటున్నారు. ఇంకోసారి రిపీట్ అయితే అస్సలు బాగోదని వార్నింగ్ ఇస్తున్నారు మెగాఫ్యాన్స్.