జర్నలిస్టును బలిగొన్న కరోనా రిపోర్టు..!

by  |
జర్నలిస్టును బలిగొన్న కరోనా రిపోర్టు..!
X

దిశ, వెబ్‌డెస్క్ :కొవిడ్ రిపోర్టు ఇవ్వడంలో జాప్యం మూలాన ఓ జర్నలిస్టు నిండు ప్రాణం పోయింది. ఏపీలోని కృష్ణా జిల్లా విజయవాడలో గురువారం ఆలస్యంగా ఈ విషయం వెలుగుచూసింది. ఐదు రోజుల కిందట జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్ లక్షణాలు ఉండటంతో శ్రీనివాస్ అనే జర్నలిస్టు ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకున్నాడు.

రిపోర్టులో ఇవ్వడంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో వైరస్ అతనిపై తీవ్ర ప్రభావం చూపించింది. బాధితుడు ప్రభుతాస్పత్రిలో చేరిన 12 గంటల వ్యవధిలోనే మృతి చెందాడు. మెడికల్ సిబ్బంది నిర్లక్ష్యం మూలానే నిండు పోయిందని బాధిత కుటుంబ సభ్యులు, బంధులు ఆరోపిస్తున్నారు.

Next Story