వైద్య ఉద్యోగుల డిప్యుటేషన్ పొడిగింపు

by  |

దిశ, న్యూస్ బ్యూరో : తెలంగాణ వైద్య విధాన పరిషత్‌కు చెందిన 77 మంది ఉద్యోగులకు శాఖలోనే ఇతర సర్వీసుల్లో డిప్యుటేషన్ పొడిగించారు. ఈ మేరకు వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. శాంతి కుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ డిప్యుటేషన్ పొడిగింపు 2020 మే 1 నుంచి 2021 ఏప్రిల్ 30 దాకా అమలులో ఉంటుందని జీవోలో పేర్కొన్నారు. నిజామాబాద్ జనరల్ ఆస్పత్రిలో పనిచేయడానికిగాను వీరి సేవలు ఉపయోగించుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Tags : health employees, deputation, extension, g.o

Next Story