బ్లాక్ ఫంగస్‌తో మెడికల్ ఆఫీసర్ మృతి

by  |
బ్లాక్ ఫంగస్‌తో మెడికల్ ఆఫీసర్ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా నుంచి కోలుకున్న వారిని బ్లాక్ ఫంగస్ వదలడం లేదు. కరోనా నుంచి కోలుకున్నాం అని ఊపిరి పీల్చుకునే లోపే బ్లాక్ ఫంగస్ రూపంలో వారిని విధి బలి తీసుకుంటుంది. తాజాగా కామారెడ్డి జిల్లాకు చెందిన మెడికల్ ఆఫీసర్ బ్లాక్ ఫంగస్ భారీనపడి ఆదివారం ఉదయం మృతి చెందాడు. వివరాల ప్రకారం.. దర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్‌గా గోవర్ధన్ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయనకు కరోనా సోకి ఈ మధ్యనే కోలుకున్నాడు. తర్వాత బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేసుకోగా బ్లాక్ ఫంగస్ నిర్ధారణ అయ్యింది. దీంతో గోవర్ధన్ హైదరాబాద్‌లో‌ని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి క్షీణించి ఈ రోజు ఉదయం మరణించాడు.



Next Story

Most Viewed