మగవాళ్లకు వైద్యశాఖ ఆఫర్.. ఆపరేషన్ చేసి రూ.1100 ఇస్తామంటున్న డాక్టర్లు!

by  |
No scalpel vasectomy
X

దిశ, తెలంగాణ బ్యూరో : పిల్లలు పుట్టకుండా ఆపరేషన్​చేయించుకున్న మగవాళ్లకు వైద్యశాఖ రూ.1100 నగదు అందించనుంది. కుటుంబ నియంత్రణలో పురుషులు కూడా భాగస్వామ్యం కావాలని పేర్కొన్నది. ఈ మేరకు నో స్కాల్సెల్ వ్యాసెక్టమీ(ఎన్ఎస్‌వీ) ఆపరేషన్​ చేసుకోవాలని సూచించింది. తొలి విడత రంగారెడ్డి జిల్లాలో ఈ నెల 29వ తేది నుంచి షురూ చేయనున్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ డాక్టర్ స్వరాజ్య లక్ష్మీ మాట్లాడారు.

కుటుంబ సంక్షేమంలో భార్యభర్తలు ఇద్దరిదీ సమాన బాధ్యతన్నారు. పిల్లలను కనే కష్టమైన పనిని స్త్రీ భరిస్తుండగా, కుటుంబ నియంత్రణలో పురుషులు భాగస్వామ్యం కావాలన్నారు. దీనిలో భాగంగా అతి సులువైన ఎన్ఎస్వీ ఆపరేషన్​ చేయించుకోవాలన్నారు. ఇది కోత, కుట్టులేని అతి సులువైన ఆపరేషన్ అన్నారు. దీన్ని కేవలం 5 నుంచి పది నిమిషాల్లో పూర్తి చేయొచ్చన్నారు. 30 నిమిషాలు అనంతరం ఇంటికి వెళ్లవచ్చన్నారు. దీని వలన లైంగిక పటుత్వంలో, దాంపత్య జీవితానికి ఎలాంటి ఆటంకం రాదన్నారు. ఆపరేషన్​పూర్తయిన మూడు రోజుల తర్వాత ఎలాంటి అపోహలు లేకుండా అన్ని పనులు చేసుకోవచ్చన్నారు.

రంగారెడ్డి జిల్లాలో ఈనెల 29 నుంచి డిసెంబరు 4 వరకు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు. 29న సీహెచ్సీ ఇబ్రహీంపట్నం, 30న పీహెచ్‌సీ సరూర్​నగర్, డిసెంబరు 1న సీహెచ్‌సీ శంషాబాద్, 2న సీహెచ్‌సీ షాద్ నగర్, 3న సీహెచ్‌సీ చేవేళ్ల, 4వ తేదీన పీహెచ్‌సీ కందుకూర్‌లో ఎన్ఎస్‌వీలను నిర్వహిస్తామన్నారు.


Next Story

Most Viewed