కోటగిరిలో విద్యార్థులకు వైద్య పరీక్షలు

by  |
school-students1
X

దిశ, కోటగిరి: కోటగిరి మండలం కల్లూరు గ్రామంలోని ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో అజాదికా అమృత్ మహోత్సవం డాక్టర్ భాను ప్రకాష్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు కబడ్డీ పోటీలను నిర్వహించారు. క్రీడల వల్ల కలిగే ప్రయోజనాల గురించి విద్యార్థులకు తెలియజేశారు. అనునిత్యం క్రీడలు ఆడడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చని అన్నారు. అనంతరం యోగా ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ క్రిష్ణవేణి, పురుషోత్తం, ప్రియాంక, స్వప్న, ప్రేమకుమార్ ఉపాధ్యాయులు ఎండీ ముఖీం, సత్యనారాయణ, సుశీల్ కుమార్, భీమ్రావు, గోదావరి విద్యార్థులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed