- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, తెలంగాణ బ్యూరో : జాతీయ వైద్య మండలి వైద్య విద్యలో ‘ఎండీ మెడికల్ జెనటిక్స్’ అనే కొత్త కోర్సును ప్రవేశపెట్టింది. జన్యుసంబంధిత వ్యాధులు గుర్తింపు, చికిత్సలు చేపట్టేందుకు ఈ కోర్సును ప్రవేశపెట్టారు. ఈ కోర్సుకు సంబంధించిన వివరాలను జాతీయ వైద్యమండలి తన అధికారిక వెబ్సైట్లో ఉంచింది. కోర్స్ కాల వ్యవధి మూడేండ్లుగా నిర్ణయించారు. జనరల్ మెడిసిన్, గైనకాలజిస్ట్, పిడియాట్రిక్స్ పూర్తి చేసిన వారు అర్హులుగా ప్రకటించారు. ఈ కోర్సులో సీట్లను భర్తీ చేసేందుకు జాతీయ స్థాయిలో ప్రవేశపరీక్షను నిర్వహించనున్నారు.
దేశంలోని కొన్ని ప్రతిష్టాత్మక వైద్య కళాశాలల్లోనే వచ్చే ఏడాది ఈ కోర్సును అందుబాటులోకి తీసుకురానున్నారు. తర్వాత అన్ని మెడికల్ కళాశాలల్లో ఈ కోర్సును ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం జన్యసంబంధిత వ్యాధులను గుర్తించేందుకు జెనెటిక్ సైంటిస్టులను ఆశ్రయించాల్సి వస్తుంది. ఈ వ్యాధులకు ప్రత్యేకమైన చికిత్సలు సైతం లేకపోవడంతో పలు సమస్యలు తలెత్తుతున్నాయి. వీటన్నింటిని అధిగమించేందుకు మెడికల్ జెనటిక్స్ కోర్సును ప్రవేశపెడుతున్నట్టుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.