నా ప్రమేయం లేదు : మేయర్ విజయలక్ష్మి

by  |
Mayor Vijayalakshmi
X

దిశ, తెలంగాణ బ్యూరో: షేక్‌పేట్ తహసీల్దార్ బదిలీ వ్యవహారంలో తన ప్రమేయం లేదని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి స్పష్టం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వక్రీకరించారని తెలిపారు. తహసీల్దార్ బదిలీ రెవెన్యూ శాఖ వ్యవహారమే తప్ప తనకు అందులో ఎలాంటి పాత్ర లేదని మంగళవారం ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నగరంలో వందేండ్లలో రానంత ఎక్కువగా గతేడాది వర్షాలు కురిశాయని, అంతటి స్థాయిలో భారీ వర్షాలు, వరదలు రాకుండా చూడాలని దేవుడిని కోరుకుంటానన్న తన వ్యాఖ్యలకు పూర్తి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

Next Story

Most Viewed