- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్బ్యూరో: హైదరాబాద్ నగరంలో 60శ్మశాన వాటికలలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. సోమవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కార్పొరేటర్ సాయిబాబాతో కలిసి మల్కంచెరువు సుందరీకరణలో భాగంగా చెరువు వెనకవైపు వంద అడుగుల వెడల్పుతో విస్తరించనున్న రోడ్డు ప్రతిపాదనలను పరిశీలించారు. ప్రతిపాదిత రోడ్డు విస్తరణకు, హౌసింగ్ బోర్డు భూమికి మధ్య ఉన్న శ్మశానవాటికను పరిశీలించారు. శ్మశాన వాటికకు విద్యుత్, విద్యుత్ లైటింగ్, తాగునీరు సదుపాయాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. భవిష్యత్ అవసరాల నిమిత్తం 100ఫీట్ల రోడ్డు నిర్మాణానికి సహకరించాలని బస్తీవాసులను కోరారు. ఈ పర్యటనలో ఈఈ వెంకటేశ్వర్లు, ఎ.కె.రెడ్డి పాల్గొన్నారు.
Next Story