- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ముంబయి: మన దేశ టోకు ద్రవ్యోల్బణ గణాంకాలు మే నెలలో ప్రతికూలంగా నమోదనట్టు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం(డీపీఐఐటీ) వెల్లడించింది. అందుబాటులో ఉన్న గణాంకాలను సమీక్షించిన అనంతరం మే నెలలో టోకు ద్రవ్యోల్బణం -3.21 శాతంగా నమోదైంది. ఏప్రిల్లో పరిమిత సమాచారం ఉండటం వల్ల మే గణాంకాలను మార్చి గణాంకాలతో పోల్చినట్టు డీపీఐఐటీ సోమవారం ప్రకటించింది. కరోనా వ్యాప్తితోపాటు లాక్డౌన్ వల్ల ఏప్రిల్ టోకు ద్రవ్యోల్బణ గణాంకాలను వెల్లడించలేదని తెలిపింది. లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ విధానంలో ధరల డేటాను సేకరించాలని కేంద్ర గణాంకాల శాఖ, కిందిస్థాయి కార్యాలయాలను సూచించింది. ఈ ఏడాది ఏప్రిల్ చివరి సూచిక జూలైలో విడుదల అవుతుందని డీపీఐఐటీ పేర్కొంది. ఆహార ద్రవ్యోల్బణం 1.13 శాతానికి దిగొచ్చింది. తయారీ, ఇంధన ద్రవ్యోల్బణం ప్రతికూలతల్లో నమోదయ్యాయి. సమాచారం లేకపోవడంతో మే నెల రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలను జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేయలేకపోయింది.