బిగ్ బ్రేకింగ్.. మావోయిస్టుల ఘాతుకం.. మాజీ సర్పంచ్ హత్య

by  |
బిగ్ బ్రేకింగ్.. మావోయిస్టుల ఘాతుకం..  మాజీ సర్పంచ్ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం సూరవీడు గ్రామ మాజీ సర్పంచ్ రమేష్ ను హత్య చేశారు. తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దులో రమేష్ ను హత్య చేసినట్లు మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. పోలీసులకు రమేష్ ఇన్‌ఫార్మర్ గా మారి మావోయిస్టుల హత్యకు కుట్ర చేశాడనే నెపంతో చంపేసినట్లు మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. ఛత్తీస్ గఢ్ లోని కొత్తపల్లి వద్ద రమేష్ మృతదేహంను గుర్తించారు. కాగా రెండురోజుల క్రితం రమేష్ ను మావోయిస్టులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed