బోధన్ బస్‌స్టాండ్ లో భారీ దొంగతనం

by Batti.Sumithra |   (  Updated:2021-08-13 11:07:02  IST  )

<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలోని బోధన్ బస్టాండ్‌లో భారీ చోరీ జరిగింది. ఈ సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. సికింద్రాబాద్ కు చెందిన బంగారు, వెండి నగల వర్తకుడు దళపతి గురువారం బోధన్‌లో వ్యాపారం చేసుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. బస్టాండ్‌లో హైదరాబాద్ కు రాత్రి బస్సు ఎక్కి టికెట్ కోసం డ్రైవర్ వద్దకు వెళ్లి వచ్చే లోపల అతని దృష్టిని మల్లించి బ్యాగ్ కాజేశారు. అందులో 41 తులాల బంగారం, 8 కేజీల వెండి, లక్షా [&hellip;]</p>

బోధన్ బస్‌స్టాండ్ లో భారీ దొంగతనం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలోని బోధన్ బస్టాండ్‌లో భారీ చోరీ జరిగింది. ఈ సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. సికింద్రాబాద్ కు చెందిన బంగారు, వెండి నగల వర్తకుడు దళపతి గురువారం బోధన్‌లో వ్యాపారం చేసుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. బస్టాండ్‌లో హైదరాబాద్ కు రాత్రి బస్సు ఎక్కి టికెట్ కోసం డ్రైవర్ వద్దకు వెళ్లి వచ్చే లోపల అతని దృష్టిని మల్లించి బ్యాగ్ కాజేశారు.

అందులో 41 తులాల బంగారం, 8 కేజీల వెండి, లక్షా యాభై వేల నగదును గుర్తు తెలియని ఆగంతకులు చోరీ చేశారు అని బోధన్ పోలీస్ లకు ఫిర్యాదు చేసారు. దళపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు బోధన్ ఎస్‌హెచ్‌వో రామన్ తెలిపారు. రెక్కి నిర్వహించే ఈ చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Next Story