ఆ మారుతీ సుజుకి కార్ల ధరల పెంపు!

by  |
ఆ మారుతీ సుజుకి కార్ల ధరల పెంపు!
X

దిశ, వెబ్‌డెస్క్: పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేందుకు దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా సోమవారం ఎంపిక చేసిన మోడళ్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. దాదాపు రూ. 34 వేల వరకు పెంపు ఉండనున్నట్టు, పెరిగిన కొత్త ధరలు సోమవారం నుంచే అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది. ఈ ధరల మార్పు వివిధ మోడళ్లను బట్టి ఈ పెంపు ఉంటుందని పేర్కొంది. అయితే, కంపెనీ ఏ ఏ మోడళ్లపై అనేది స్పష్టం చేయనప్పటికీ, ధరల పెరుగుదల వల్ల అన్ని మోడళ్లపై ఎంతోకొంత ప్రభావం ఉంటుందని, కొన్ని మోడళ్లు మాత్రమే ఈ ధరల పెంపు నుంచి ఉపశమనం పొందుతాయని కంపెనీ డీలర్ వర్గాలు స్పష్టం చేశాయి. పెరుగుతున్న ఇన్‌పుట్ వ్యయాల నేపథ్యంలో ధరల పెంపు జనవరి నుంచి ఉంటుందని నెలరోజుల క్రితమే ఓ ప్రకటనలో తెలిపింది.



Next Story

Most Viewed