స్పిన్నర్లపై దాడి పెంచాలి : గప్టిల్

by  |
స్పిన్నర్లపై దాడి పెంచాలి : గప్టిల్
X

భారత్‌తో శనివారం జరగనున్న రెండో వన్డేలో స్పిన్నర్లపై దాడిని మరింత పెంచాలని న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ తమ జట్టు సభ్యులకు సూచించాడు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇప్పటికే న్యూజిలాండ్ 1-0తో ముందంజలో ఉంది. బుధవారం హామిల్టన్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో కివీస్ బ్యాట్స్‌మెన్ భారత స్పిన్నర్లు కుల్దీప్, జడేజా ఇద్దరి బౌలింగ్‌లో కలిపి 148 పరుగులు రాబట్టి 347 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన సంగతి తెలిసిందే. అదే రీతిన రెండో వన్డేలోనూ స్పిన్నర్లపై దాడి కొనసాగించి విజయంతో సిరీస్‌ను కైవసం చేసుకోవాలని గప్టిల్ తెలిపాడు.

Next Story

Most Viewed