ఏటిగట్టుపై వివాహిత దారుణ హత్య..

by  |
ఏటిగట్టుపై వివాహిత దారుణ హత్య..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తణకు మండలం దువ్వవయ్యూరు దారుణం జరిగింది. గ్రామంలోని ఏటి గట్టు వద్ద వివాహిత దారుణంగా హత్యకు గురైంది. మృతురాలిని పచ్చల వరలక్ష్మి(35)గా గుర్తించారు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త శ్రీను భార్య గొంతు కోసి హత్య చేసి పరారైనట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు.

Next Story

Most Viewed