చర్లలో మావోయిస్టుల దుశ్చర్య

by  |
చర్లలో మావోయిస్టుల దుశ్చర్య
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా చ‌ర్ల మండ‌లం అట‌వీ ప్రాంతంలో మావోయిస్టులు మంగ‌ళ‌వారం రాత్రి విధ్వంసం సృష్టించారు. మండ‌లం బ‌త్తినిప‌ల్లి గ్రామానికి రోడ్డు నిర్మాణ ప‌నులు కొన‌సాగిస్తున్న రెండు వాహ‌నాల‌కు నిప్పుపెట్టారు. మంగ‌ళ‌వారం రాత్రి ఈ ఘట‌న చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం-తూర్పుగోదావ‌రి మావోయిస్టు క‌మిటీ పేరుతో ఓ లేఖ‌ను వ‌దిలివెళ్లారు. ఈ నెల 28న మావోయిస్టుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వం జ‌రుపుకోవాల‌ని ఆ లేఖ‌లో పేర్కొన్నారు.

Next Story

Most Viewed