పెళ్లిచూపులకు వెళ్లిన ఇద్దరు హత్య

by  |
పెళ్లిచూపులకు వెళ్లిన ఇద్దరు హత్య
X

దిశ వెబ్ డెస్క్: దంతెవాడలో దారుణం చోటు చేసుకుంది. పోలీసు ఇన్ ఫార్మర్లు అనే అనుమానంతో ఇద్దరు గ్రామస్తులను మావోయిస్టులు చంపారు. దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ వివరాల ప్రకారం… అశోక్ కుంజం అనే వ్యక్తి దంతెవాడ జిల్లాలోని కిరాండుల్ పట్టణంలో నివాసం ఉంటున్నాడు. పెండ్లి చూపుల కోసం తన కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఆయన బీజీపూర్ జిల్లాలోని దుడి తుమ్నార్ గ్రామానికి వెళ్లాడు.

కాగా పెండ్లి చూపులు ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. మార్గ మధ్యలో అశోక్ ను, అతని స్నేహితున్ని మావోయిస్టులు అడ్డిగించి వారిపై కాల్పులు జరిపారు. కాగా వారిద్దరు పోలీసు ఇన్ ఫార్మర్లనీ…అందుకే వారిని కాల్చిచంపినట్టు మావోయిస్టులు లేఖ వదిలి వెళ్లారు. అయితే వారికి పో‌లీసులతో ఎలాంటి సంబంధం లేదని ఎస్పీ తెలిపారు. పోలీసులకు గ్రామస్తుల సహాయం చేయకుండా ఉండేందుకు వారిని భయాందోళనలకు గురి చేసేందుకే కాల్పులకు పాల్పడి ఉంటారని ఎస్పీ తెలిపారు.

Next Story

Most Viewed