అటు అన్నల చర్యలు.. ఇటు నిరసన ధ్వనులు

by  |

దిశ, కరీంనగర్: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా కోర్సిలో మావోయిస్టుల చర్యలను వ్యతిరేకిస్తూ.. స్థానిక ప్రజలు నిరసన చేపట్టారు. వివరాల్లోకెళ్తే.. కోర్సిలో రహదారుల నిర్మాణానికి ఉపయోగిస్తున్న వాహనాలను మావోయిస్టులు దగ్దం చేశారు. అంతటితో ఆగకుండా ఇన్‌ఫార్మర్ పేరిట ఓ వ్యక్తిని కాల్చి చంపారు. ఈ రెండు ఘటనలతో ఆగ్రహానికి గురైన స్థానిక ప్రజలు మావోయిస్టు వ్యతిరేక నినాదాలతో అటవీ గ్రామంలో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం మావోయిస్టుల దిష్టి బొమ్మను దహనం చేశారు.

Tags: effigy burned, gadchiroli, maharastra, maoists, protests, maoistskilled

Next Story

Most Viewed