గ్రామస్తులపై మావోయిస్టుల దాడి

by  |
గ్రామస్తులపై మావోయిస్టుల దాడి
X

దిశ, వెబ్ డెస్క్: అది మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతం.. అక్కడ ఇప్పుడిప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి గ్రామ ప్రజలు అభివృద్ధి పనులకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ మావోయిస్టులు గ్రామంపై దాడి చేసి దాదాపు 20 మందిని చితకబాదారు. వీరిలో మహిళలు, పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఈఘటన ఛత్తీస్‌గడ్‌లోని దంతేవాడ జిల్లా చిక్‌పాల్ గ్రామంలో చోటుచేసుకుంది.

జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ మీడియాతో మాట్లాడుతూ.. కలెక్టర్ ఆదేశాల మేరకు దంతేవాడ పరిసర గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళలు పాలుపంచుకుంటున్నారు. చిక్‌పాల్‌లోని 10 మంది మహిళల బృందం అంగన్‌వాడీ కేంద్రం భోజనాన్ని ఇతరులకు వినియోగిస్తున్నట్లు పల్లవ తెలిపారు. గత 30 ఏళ్లలో చిక్‌పాల్ వాసులు స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొన్నలేదు. కానీ, ఈ ఏడాది వారు ఘనంగా జాతీయ జెండాను ఎగురు వేశారు.



Next Story

Most Viewed