- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : మరో మావోయిస్టు అగ్రనేత పోలీసుల ఎదుట లొంగిపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల ఏరివేతపై ప్రధానంగా దృష్టి సారించగా వరుసగా అడవిని వీడి జనబహుళ్యంలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇటీవల కొందరు మావోయిస్టులు కొవిడ్ బారిన పడి మరణించడంతో మరి కొందరు వైద్యం కోసం లొంగిపోయారు. ఆరోగ్యం సహకరించక కూడా కొందరు అడవిని వీడుతున్నట్లు సమాచారం.
తాజాగా మావోయిస్టు అగ్రనేత రావుల రంజిత్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈయన మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు రావుల శ్రీకాంత్ కుమారుడు. ప్రస్తుతం రంజిత్ బెటాలియన్ చీఫ్గా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. రావుల రంజిత్ లొంగుబాటు విషయాన్ని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి మీడియా సమావేశంలో ప్రకటించారు. కాగా, ఆయన లొంగిపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story