మావోయిస్టుల రివెంజ్..? AOB బోర్డర్‌లో పోలీసుల తనిఖీలు

by  |
మావోయిస్టుల  రివెంజ్..? AOB బోర్డర్‌లో పోలీసుల తనిఖీలు
X

దిశ, ఉత్తరాంధ్ర :మావోయిస్టు అగ్రనేత అరెస్టు నేపథ్యంలో ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టు అగ్రనేత దుబాసీ శంకర్‌‌ను ఒడిశాలో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మావోయిస్టులు ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశం ఉందనే సమాచారంతో పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. సీలేరు ఎస్ఐ రంజిత్‌ ఆధ్వర్యంలో సరిహద్దు కూడలి, జెన్‌కో తనిఖీ కేంద్రం వద్ద విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. మన్యంలోకి వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేయడమే కాకుండా అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


Next Story

Most Viewed