- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, భద్రాచలం: ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఛోటెడోంగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహ్కేర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లుగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు డీఆర్జీ జవాన్లు గాలింపు చర్యలు చేపట్టారు. అదే సమయంలో తారసపడిన మావోయిస్టులు జవాన్ల వైపుకి కాల్పులు జరపడంతో ఆత్మరక్షణార్థం జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం సంఘటన ప్రాంతంలో ఒక మావోయిస్టు మృతదేహం, ఏకె 47 ఆయుధం, ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టు 6వ నంబర్ కంపెనీ కమాండర్ సాకేత్ నురుటిగా గుర్తించినట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Next Story