మావోయిస్టుల డంప్ స్వాధీనం

by  |
మావోయిస్టుల డంప్ స్వాధీనం
X

దిశ, వెబ్‎డెస్క్:
ఆంధ్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టుల డంప్‌ను బీఎస్ఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కదలికలపై సమచారం రావడంతో స‌రిహ‌ద్దు భద్రతా బ‌ల‌గాలు స్వాభిమాన్ ఆంచల్ కటాఫ్ ఏరియాలో గాలింపు చర్యలు నిర్వహించారు. ఈ క్రమంలోనే గురువారం మావోయిస్టులు దాచి ఉంచిన డంప్‌ను పోలీసులు గుర్తించారు. 2 ఎస్ఎల్ఆర్ రైఫిల్స్, 303 రైఫిల్స్, 3 ఎస్ఎల్ఆర్ మ్యాగజైన్స్, ఐఈడీ, 9 రౌండ్ల ఎస్ఎల్ఆర్ బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన డంప్ గా పోలీసులు భావించారు. దీంతో విశాఖ ఏజేన్సీలో పోలీసులు అప్రమత్తమయ్యారు.



Next Story