పోలీస్ క్యాంప్‌పై ముప్పేట దాడి.. జవాన్ మృతి!

by Batti.Sumithra |   (  Updated:2020-07-27 00:43:19  IST  )

<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: ఛత్తీస్ గఢ్ లోని దండకారణ్య అటవీ ప్రాంతం కాల్పుల మోతలతో దద్దరిల్లిపోతోంది. సోమవారం ఉదయం 8.30 గంటలకు మావోయిస్టులు పెద్ద సంఖ్యలో పోలీస్ క్యాంప్ పై ముప్పేట దాడి చేశారు. ప్రాథమిక సమాచారం అందేసరికి ఒక జవాను మృతిచెందినట్లు తెలుస్తోంది. రెండున్నర గంటలుగా మావోయిస్టులు, బలగాలకు మధ్య భీకర పోరు కొనసాగుతోంది. దంతెవాడ, నారాయణ్ పూర్ మధ్యలోని దట్టమైన అటవీప్రాంతంలో బార్సూర్ పల్లి దారిలో ఉన్న ఈ క్యాంప్ పై వందమందికి పైగా [&hellip;]</p>

పోలీస్ క్యాంప్‌పై ముప్పేట దాడి.. జవాన్ మృతి!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఛత్తీస్ గఢ్ లోని దండకారణ్య అటవీ ప్రాంతం కాల్పుల మోతలతో దద్దరిల్లిపోతోంది. సోమవారం ఉదయం 8.30 గంటలకు మావోయిస్టులు పెద్ద సంఖ్యలో పోలీస్ క్యాంప్ పై ముప్పేట దాడి చేశారు. ప్రాథమిక సమాచారం అందేసరికి ఒక జవాను మృతిచెందినట్లు తెలుస్తోంది. రెండున్నర గంటలుగా మావోయిస్టులు, బలగాలకు మధ్య భీకర పోరు కొనసాగుతోంది. దంతెవాడ, నారాయణ్ పూర్ మధ్యలోని దట్టమైన అటవీప్రాంతంలో బార్సూర్ పల్లి దారిలో ఉన్న ఈ క్యాంప్ పై వందమందికి పైగా మావోయిస్టులు కాల్పులు జరిపినట్టు సమాచారం.

Next Story