ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టుల మెరుపుదాడి

by  |
ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టుల మెరుపుదాడి
X

దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. ఈ ఘటనలో నిక్కో కంపెనీ ఉద్యోగి ఒకరు మరణించగా, నాలుగు వాహనాలను నక్సల్స్ దహనం చేశారు. ఈ ఘటనను బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ ధృవీకరించారు. నారాయణపూర్‌కి సుమారు 50 కి.మీ దూరంలోని చిన్నడోంగార్ నామ్డే గనిలో నిక్కో కంపెనీ గత కొంతకాలంగా పనులు చేస్తోంది. ఈ పనుల పట్ల మావోయిస్టులు పలుమార్లు నిరసన వ్యక్తం చేసినట్లు సమాచారం.

శుక్రవారం రాత్రి మావోయిస్టులు పనులు జరిగే ప్రాంతంలో ఐఈడీ పేల్చి చేతి గ్రైనేడు విసిరినట్లుగా తెలిసింది. కంపెనీ ఉద్యోగులను కర్రలతో కొట్టినట్లు సమాచారం. మావోయిస్టుల దాడిలో ఓ ఉద్యోగి మరణించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మావోయిస్టులు నాలుగు వాహనాలకు నిప్పు పెట్టి దహనం చేశారు. ఆ ప్రాంతంలో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని బస్తర్ ఐజీ తెలిపారు.



Next Story

Most Viewed