- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సినిమా : రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ‘సత్య’ సినిమా రిలీజై 23 ఏళ్లయిన సందర్భంగా అందులో లీడ్ యాక్టర్గా నటించిన మనోజ్ బాజ్పాయ్ ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు. గ్యాంగ్ వార్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ‘భికు మాత్రే’ పాత్రలో నటించిన మనోజ్.. షూటింగ్ మొదలుపెట్టిన మూడు రోజులకే ఆగిపోయిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. మేకర్స్కు ఫైనాన్షియల్ సమస్యలు తలెత్తడంతో అలా జరిగిందన్నారు.
ఆ టైమ్లో ఇక తమ కెరీర్ మళ్లీ జీరోకు వచ్చినట్టే అని భయపడ్డామని, అయితే రాము ఉన్నాడనే ధైర్యం తమను కూల్గా ఉంచగలిగిందని చెప్పారు. ఆ తర్వాత ప్రొడ్యూసర్ ‘భరత్ షా’ మూవీని ప్రజెంట్ చేసేందుకు ముందుకు రావడంతో ఊపిరి పీల్చుకున్నారట. ఈ మేరకు మళ్లీ షూటింగ్ స్టార్ట్ అయ్యేందుకు 10-15 రోజుల టైమ్ పట్టిందన్నారు. అంతేకాదు ‘సత్య’లో పాటలు లేవని డిస్ట్రిబ్యూటర్స్ అబ్జెక్ట్ చేయడంతో ఫైనల్ స్టేజ్లో విశాల్ భరద్వాజ్తో పాటలు చేయించినట్లు తెలిపారు. సినిమాలోని ‘గోలిమార్’ సాంగ్ను షూటింగ్ చివరి రోజున కేవలం 6 గంటల్లోనే చిత్రీకరించామని గుర్తుచేసుకున్నాడు. కాగా భికు మాత్రే పాత్రకు గాను మనోజ్కు సపోర్టింగ్ యాక్టర్గా నేషనల్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే.