కోలుకున్న మాజీ ప్రధాని.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

by  |
కోలుకున్న మాజీ ప్రధాని.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
X

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్యం నుంచి కోలుకున్నారు. ఈ రోజు అతను తన సొంతింటికి చేరాడు. సింగ్… రిపోర్టులన్నీ నార్మల్‌గానే వచ్చినట్టు సమాచారం. దీంతో మన్మోహన్ సింగ్‌ను ఇంటికి తరలించినట్టు ఆయన కార్యాలయం తెలిపింది. ఛాతి నొప్పితో గత ఆదివారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆయన చేరారు. వెంటనే ఎయిమ్స్‌లోని కార్డియో-తొరాసిక్ వార్డులోకి తరలించి అక్కడ అతన్ని అబ్జర్వేషన్‌లో ఉంచారు. దేశంలోకి కరోనా ఎంటర్ అయిన తొలినాళ్లలో మార్చి నెలలో మన్మోహన్ సింగ్ అనారోగ్యం పాలవ్వగా.. పూర్తిగా బెడ్‌రెస్ట్ తీసుకోమని వైద్యులు సూచించిన విషయం తెలిసిందే.

Next Story