మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు‌కు కరోనా

by  |
మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు‌కు కరోనా
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కరోనా బారిన పడ్డారు. ఆయన హైదరాబాద్‌లోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే వైసీపీ కీలక నేతలు అంబటి, బాలినేని, అంజాద్ బాషా, విజయసాయి‌రెడ్డి, రోషయ్య తదితరులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కాగా, రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకీ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దాదాపు 10 వేల కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి.

Next Story

Most Viewed