యోగి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి : మందకృష్ణ

by  |
యోగి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి : మందకృష్ణ
X

దిశ, వెబ్‌డెస్క్: యూపీలో సంచలనం సృష్టించిన హథ్రాస్ ఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా దీనిపై మందకృష్ణ మాదిగ స్పందించారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఉత్తరప్రదేశ్‌లో మహిళపై హత్యాచారానికి పాల్పడిన నిందుతులను కాపాడుతున్న ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాంద్ చేశారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్లక్ష్యం కారణంగానే దళిత యువతి బలైపోయిందని ఆరోపించారు. సాక్ష్యాలు లేకుండా ఉండేందుకే పక్కా ప్రణాళిక ప్రకారం దహనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed