కరోనాను క్యాష్ చేసుకుంటున్న క్రిమినల్స్ : మనోజ్

by  |
కరోనాను క్యాష్ చేసుకుంటున్న క్రిమినల్స్ : మనోజ్
X

దిశ, వెబ్‌డెస్క్: మంచు మనోజ్… ఇతర హీరోలకు భిన్నంగా స్పందిస్తుంటాడు. సమాజంలో జరిగే ప్రతీ విషయంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే మనోజ్.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై కూడా స్పందించారు. అందరు ప్రముఖుల మాదిరిగా కేవలం సోషల్ మీడియాలో మెస్సేజ్ ఇవ్వడానికి మాత్రమే పరిమితం కాకుండా… ఈ సమయంలో అత్యంత అవసరమైన సానిటైజర్లు, మాస్క్‌లు పంపిణీ చేస్తున్నారు. ప్రతీ ఒక్కరు శుభ్రంగా, బాధ్యతాయుతంగా ఉంటూ.. ఇతరులకు కూడా కరోనాపై అవగాహన పెంచాలన్నారు. అనవసరంగా భయాందోళనకు గురికారాదని సూచించారు.

ఇదిలా ఉంటే కరోనా వ్యాప్తి చెందుతున్న సమయాన్ని క్రిమినల్స్ క్యాష్ చేసుకుంటున్నారని విన్నానని తెలిపారు మనోజ్. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేలా ప్రభుత్వం ఇళ్లను శుభ్రం చేసేందుకు తమను పంపించిందని చెబుతూ ఇళ్లలోకి ప్రవేశించి దొంగతనాలకు పాల్పడుతున్నారని చెప్పారు. సర్కార్ అలాంటి వారిని ఎవరిని నియమించలేదని ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.


Tags: Manchu Manoj, Covid 19, CoronaVirus, Coronavirus Outbreak



Next Story

Most Viewed