సేవాతత్వానికి ఆదర్శమే మనం ఫౌండేషన్..!

by  |
సేవాతత్వానికి ఆదర్శమే మనం ఫౌండేషన్..!
X

దిశ, గజ్వేల్: సమాజానికి తన వంతు చేయూతను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న మనం ఫౌండేషన్‎ను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ కోరారు. గజ్వేల్ మండలం సింగాటం గ్రామానికి చెందిన శ్రీనాథ్ అనే పేద విద్యార్థి పాండిచ్ఛేరి సెంట్రల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. ఫ్రాన్స్‎లోని ఓ ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్‎కు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కడే ఎంపికయ్యాడు. మరికొద్ది రోజుల్లో పారీస్ వెళ్లాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో ఆన్‎లైన్ కోర్సు కోసం శ్రీనాథ్‎కు ల్యాప్‎టాప్ అవసరమైంది. ల్యాప్‎టాప్‎ను కొనే స్థోమత లేని శ్రీనాథ్‎కు మనం ఫౌండేషన్‎కు చేయూతనిచ్చింది. గజ్వేల్ ప్రెస్‎క్లబ్ ప్రాంగణంలో సోమవారం విరాహత్ అలీ చేతుల మీదుగా శ్రీనాథ్‎కు ల్యాప్‎టాప్ అందించారు. ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లాడుతూ.. నేటి సమాజంలో పేద ప్రజల క్షేమాన్ని కాంక్షించే నాథులే కరువైపోయినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో శ్రీనాథ్‎కు గజ్వేల్ ప్రెస్‎క్లబ్ అండగా ఉంటుందని తెలిపారు.

Next Story

Most Viewed