విధుల్లో నిర్లక్ష్యం.. ZPHS ప్రధానోపాధ్యాయురాలి సస్పెన్షన్

by  |
విధుల్లో నిర్లక్ష్యం.. ZPHS ప్రధానోపాధ్యాయురాలి సస్పెన్షన్
X

దిశ, కరీంనగర్ సిటీ : ప్రధానోపాధ్యాయురాలి హోదాలో ఉండి విధులు సరిగా నిర్వహించకుండా తోటి ఉపాధ్యాయురాలిని ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారిని సస్పెండ్ చేస్తూ డీఈవో గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటన మానకొండూరు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో వెలుగుచూసింది. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న జ్యోతి అదే పాఠశాలలో పనిచేసి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన నళిని అనే సహఉపాధ్యాయురాలిని కోర్టు ఉత్తర్వుల మేరకు తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సి ఉన్నా తనకేమీ పట్టనట్టుగా వ్యవహరించింది.

దీంతో సదరు ఉపాధ్యాయురాలు డీఈవోకు ఫిర్యాదు చేసింది. సదరు ఉద్యోగిని విధుల్లోకి తిరిగి తీసుకోకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ విద్యాధికారి మెమో జారీ చేశారు. అయినా పట్టించుకోకపోవడంతో DEO విద్యాశాఖ ప్రాంతీయ సహాయ సంచాలకులు (REO)కు జ్యోతిపై పనితీరుపై నివేదిక పంపటంతో ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ (RJD) సత్యనారాయణ రెడ్డి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఏడాది కాలంగా విధుల్లోకి తీసుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తుండటం, కంటెమ్ట్ ఆఫ్ కోర్ట్ ఆర్డర్స్ కింద నళిని మరోసారి కోర్టు మెట్లు ఎక్కేందుకు సిద్ధం అవుతున్న విషయం తెలుసుకుని ఈ మేరకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది.

Next Story

Most Viewed