ఓడబావిలో పడిన వ్యక్తి సేఫ్.. పోలీసులకు గ్రామస్తుల అభినందన

by  |
ఓడబావిలో పడిన వ్యక్తి సేఫ్.. పోలీసులకు గ్రామస్తుల అభినందన
X

దిశ, శాయంపేట : హన్మకొండ జిల్లా శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో ఇంటి ముందున్న పాత ఓడ బావిలో వెంకటేశ్ ప్రమాదవశాత్తు జారిపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రామ సర్పంచ్ రాజిరెడ్డి పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ ప్రవీణ్, ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఘటన స్థలానికి చేరుకొని వెంటనే ముందస్తు జాగ్రత్తతో 108కి సమాచారం అందించారు.

ఓడ బావిలో పడిపోయిన వ్యక్తిని కాపాడేందుకు రెండు జేసీబీల సహాయంతో మూడు గంటల పాటు సహాయక చర్యలు జరిపి వ్యక్తిని క్షేమంగా బయటకు తీశారు. గాయాలైన వెంకటేశ్‌ను అంబులెన్స్‌లో ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. సకాలంలో స్పందించిన స్థానిక పోలీస్ కానిస్టేబుల్స్ ప్రవీణ్, స్వామి నాయక్, స్థానిక ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్‌ను గ్రామస్తులు అభినందించారు.

Next Story