- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: ఇంటికి పిలిచాడు. చాక్లెట్లు, మిఠాయిలు ఇచ్చాడు. ముగ్గురు బాలికలపై అత్యాచారం చేశాడు ఓ కామాంధుడు. టీచర్ చెప్పిన పాఠంతో జైలుకెళ్లాడు. వివరాల్లోకి వెళితే… రజనీకాంత్ మహతో అనే వ్యక్తి గుజరాత్ రాష్ట్రం వడోదర నగరంలో మకరపుర అనే ప్రాంతంలో నివసిస్తున్నాడు.
తన ఇంటికి సమీపంలో ఉండే మైనర్ బాలికలకు చాక్లెట్లు, మిఠాయిలు ఇచ్చి గదిలోకి తీసుకువెళ్లి వారిపై అత్యాచారం జరిపాడు. ఇలా రజనీకాంత్ మహతో ముగ్గురు బాలికలపై అత్యాచారం చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఈ ఉదంతం పాఠశాలలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై టీచర్ క్లాస్ చెబుతుండగా బయటపడింది. ఉపాధ్యాయురాలు ఈ క్లాస్ చెబుతున్నప్పుడు తరగతి గదిలోని ఓ బాలిక రోదించింది. తాను అత్యాచారానికి గురైనట్లు గుర్తించింది. ఈ విషయంపై కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ముగ్గురు బాలికలపై తాను అత్యాచారం చేశానని అంగీకరించడంతో రజనీకాంత్ మహతోను పోలీసులు అరెస్టు చేశారు. ఇతర బాలికలపై కూడా నిందితుడు అత్యాచారం చేశాడా అనే విషయంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.