- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహబూబాబాద్: తమ్ముడి చేతిలో అన్న దారుణ హత్యకు గురైన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై బొలగాని సతీష్ కథనం ప్రకారం.. కేసముద్రం గ్రామానికి చెందిన వెలగలబోయిన వెంకన్న యాదవ్, చంద్రయ్య అనే సోదరుల మధ్య కొంతకాలంగా భూవివాదం నడుస్తోంది.
పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. అయినప్పటికీ వారిలో మార్పులేదు. ఈ క్రమంలో శనివారం ఉదయం పొలం వద్ద మరోసారి ఇద్దరు ఘర్షణ పడ్డారు. ఇరువురి మధ్య మాటా మాటా పెరిగి గొడవ తీవ్రమైంది. తమ్ముడు చంద్రయ్య తన చేతిలో ఉన్న పారతో వెంకన్నపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు బాధితుడిని మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story