కామాంధుడి దాష్టీకం.. ఆరేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్ళి.. రేప్ చేసి, ఆ తర్వాత

by  |
కామాంధుడి దాష్టీకం.. ఆరేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్ళి.. రేప్ చేసి, ఆ తర్వాత
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. ఆరేళ్ళ చిన్నారిని ఓ కామాంధుడు రేప్ చేసి హత్యచేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాలలోకి వెళితే.. సైదాబాద్‌ సింగరేణి కాలనీలో నివాసముంటున్న ఆరేళ్ల బాలిక గురువారం సాయంత్రం అదృశ్యమైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు బాలిక కోసం వెతకడం మొదలుపెట్టారు. ఎక్కడా బాలిక ఆచూకీ కనిపించలేదు. ఇక ఈ నేపథ్యంలో అదే కాలనీలో ఉంటున్న రాజు అనే యువకుడిపై అనుమానం వచ్చి అతని ఇంటికి వెళ్లారు. కానీ ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో తాళం బద్దలు కొట్టి మరీ పాప కోసం గాలించిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, స్థానికులు అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి కుప్పకూలిపోయారు. పాప విగతజీవిగా కనిపించడంతో అంతా కన్నీటిపర్యంతమయ్యారు.

నల్గొండ జిల్లా చందంపేట్ మండలానికి చెందిన రాజు నాయక్ పొట్టకూటి కోసం కుటుంబంతో సహా హైదరాబాద్ వచ్చి ఆటో నడుపుకుంటున్నాడు. అంతేకాకుండా జులాయిగా తిరిగే అతను దొంగతనాలకు అలవాటుపడి చాలాసార్లు పోలీసులకు కూడా చిక్కాడు. ఇక ఇటీవలే భార్యను కొట్టి ఇంట్లో ఉంచి గెంటేశాడు. ఈ క్రమంలోనే కామవాంఛతో రగిలిపోయిన కామాంధుడు ఒంటరిగా ఆడుకుంటున్న బాలికపై కన్నేశాడు. అదును చూసి గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో బాలికను కిడ్నాప్ చేసి రేప్ చేశాడు. అనంతరం బాలిక మృతిచెందడంతో.. ఆమెను అక్కడే వదిలి పరారయ్యాడు.

సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్ టీం సిబ్బంది కూడా అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. బాలికను ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో పోలీసులకు స్థానికులకు మధ్య ఘర్షణ చెలరేగింది. స్థానికులు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. నిందితుడిని తమకు అప్పగించే వరకు బాలిక మృతదేహాన్ని ఇక్కడి నుంచి కదిలించేదిలేదని బస్తీవాసులు పట్టుబట్టి ఆందోళన చేస్తున్నారు.


Next Story

Most Viewed