వ్యక్తి అదృశ్యం.. మద్యానికి బానిస కావటమే కారణం

by  |
saidulu
X

దిశ, జవహర్ నగర్: ఇంట్లో నుండి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాకుండా అదృశ్యమైన ఓ వ్యక్తి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ బిక్షపతిరావు తెలిపిన కథనం ప్రకారం.. సూర్యాపేట, నర్సంపేటకు చెందిన పర్వతం సైదులు(35) పెయింటింగ్ పనిచేస్తూ, భార్య రజిత, కుమారుడు శివ ప్రసాద్ తో కలిసి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమ్మిగడ్డలోని నెహ్రూ నగర్లో నివాసముంటున్నారు. పర్వతం సైదులు(35) గత కొద్ది కాలంగా మద్యానికి బానిసై అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గత నెల 30న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. సొంతూరులో తెలిసిన వారిని విచారించినా పర్వతం సైదులు ఆచూకీ లభించలేదు. దీంతో రజిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Next Story