చేతబడి చేయలేదని వ్యక్తి హత్య?

by  |
చేతబడి చేయలేదని వ్యక్తి హత్య?
X

దిశ, అమరావతి: గుంటూరు జిల్లా నరసరావుపేటలో దారుణం చోటుచేసుకుంది. చేతబడి చేయడానికి నిరాకరించాడని ఓ వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బలుసుపాటి వీరాంజనేయులు(32) అనే వ్యక్తి గతంలో చేతబడులు చేస్తువుండేవాడు. అదే కాలనీకి చెందిన మందం వేణు సాయి అనే వ్యక్తి చేతబడి చేయాలని కోరగా వీరాంజనేయులు అందుకు నిరాకరించాడు. దీంతో ఇరువురి మధ్య తరచూ గొడవ జరిగేది. ఈ నేపథ్యంలోనే గురువారం ఇరువురి మధ్య మాటకు మాట పెరగడంతో.. మందం వేణు ఓ కత్తితో వీరాంజనేయులుపై దాడి చేశాడు. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. కాగా, ఈ హత్య వెనుక మూడో వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వేణు సాయిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.



Next Story