- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, అమరావతి: గుంటూరు జిల్లా నరసరావుపేటలో దారుణం చోటుచేసుకుంది. చేతబడి చేయడానికి నిరాకరించాడని ఓ వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బలుసుపాటి వీరాంజనేయులు(32) అనే వ్యక్తి గతంలో చేతబడులు చేస్తువుండేవాడు. అదే కాలనీకి చెందిన మందం వేణు సాయి అనే వ్యక్తి చేతబడి చేయాలని కోరగా వీరాంజనేయులు అందుకు నిరాకరించాడు. దీంతో ఇరువురి మధ్య తరచూ గొడవ జరిగేది. ఈ నేపథ్యంలోనే గురువారం ఇరువురి మధ్య మాటకు మాట పెరగడంతో.. మందం వేణు ఓ కత్తితో వీరాంజనేయులుపై దాడి చేశాడు. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. కాగా, ఈ హత్య వెనుక మూడో వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వేణు సాయిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Next Story