కర్నూలులో దారుణం : వేటకొడవల్లతో హత్య

by  |
కర్నూలులో దారుణం : వేటకొడవల్లతో హత్య
X

దిశ,వెబ్‌డెస్క్ : కర్నూలులో ఫ్యాక్షన్ గొడవలు మళ్లీ మొదలయ్యయా.. రెండు రోజుల క్రితం ఇద్దరు టీడీపీ నేతలు హత్యకు గురికాగా ఈ రోజు మరో వ్యక్తి వేటకొడవల్లకు బలయ్యాడు. ఓ వ్యక్తిని వేటకొడవల్లతో నరికి చంపిన ఘటన కర్నూలు జిల్లా గోనెగండ్లలో చోటు చేసుకుంది. బజారి అనే వ్యక్తిని దుండగులు వేటకొడవళ్లతో అతి దారుణంగా నరికి హత్య చేశారు. దీంతో కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ గొడవలు మళ్లీ మొదలయ్యాయని కొందరు అంటున్నారు. కాగా బజారి అనే వ్యక్తి‌ని హత్యకు గురికావడానికి వివాహేతర సంబంధమే కారణమని మరికొందరు అంటున్నారు. ఈ ఘటన పై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ వార్తకు సంబంధిచిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed