4 నెలల క్రితం తండ్రిని…ఇప్పుడు భార్యని

by  |
4 నెలల క్రితం తండ్రిని…ఇప్పుడు భార్యని
X

దిశ, సూర్యాపేట: అక్రమ సంబంధం కారణంతో భార్యను భర్తే హత్య చేసిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పెన్ పహాడ్ మండలం జల్మల్ కుంట తండాకు చెందిన లునవత్ స్వామి, సరోజ దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు. సజావుగా సాగుతున్న వీరి సంసారంలో అక్రమ సంబంధం అనుమానం చిచ్చురేపింది.

సొంత తండ్రే తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానం పెంచుకున్న స్వామి పలుమార్లు తండ్రి, భార్యను హెచ్చరించినా వారిలో మార్పు రావడం లేదని ఆగ్రహించిన స్వామి 4 నెలల క్రితం మంచం కర్రతో తండ్రి బీక్యాను కొట్టడంతో అక్కడికక్కడే అతను చనిపోయాడు.

ఆ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన స్వామి, 10 రోజుల క్రితమే బెయిల్ పై జైలు నుండి వచ్చాడు. వచ్చినప్పటి నుండి భార్యా భర్తలకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో గొడ్డలితో భార్య సరోజను కొట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. చికిత్స నిమిత్తం సూర్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఈ సంఘటనతో ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు.



Next Story

Most Viewed