కరోనా భయంతో వ్యక్తి అదృశ్యం..!

by  |
కరోనా భయంతో వ్యక్తి అదృశ్యం..!
X

దిశ, జగిత్యాల:

కరోనా వచ్చిందనే భయంతో ఓ వ్యక్తి అదృశ్యం అయ్యాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల గ్రామంలో చోటు చేసుకుంది. మల్యాలకు చెందిన బాలే ప్రభాకర్.. తన ఇద్దరు పిల్లలకు కొవిడ్ లక్షణాలు ఉండడంతో టెస్టు చేయించాడు. దీంతో వారికి పాజిటివ్ నిర్ధారణ అయింది. తనకు కూడా కరోనా సోకిందేమో అని ఆందోళన చెంది ఆగస్టు 29న కరోనా టెస్టులు చేయించుకునేందుకు బయటికి వెళ్లాడు. ఆ రోజు బయటికి వెళ్లిన వ్యక్తి తిరిగి రాలేదని ప్రభాకర్ భార్య మంజుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.

Next Story

Most Viewed